మన ఊరి ఆరోగ్య వికాసం

గ్రామ ప్రజలకు శుభవార్త.
ది:14-07-2019 ఆదివారం కట్టావారిపాలేం లోని పాత గవర్నమెంట్ పాటశాల వద్ద షుగర్ మరియు బిపి వైద్య శిబిరం ఉదయం 6.30 గం నుండి 9.30 గం వరకు జరుగును. ప్రముఖ వైద్యులు డా. కంకణాల కృష్ణమోహన్ గారు రోగులను ఉచితంగా పరీక్షించేదరు.
గమనిక:ఈ శిబిరంలో మెడాల్ సంస్థ వారు 57 రకాల ముఖ్యమైన రక్త పరీక్షలు (గుండె, లివరు, కిడ్నీలు, షుగర్ మరియు ఇతరములు) కేవలం రూ.640/- చేస్తారు. ఆరోగ్య అభిలాషులు ఈ సదవకాశం సద్వినియోగం చేసికొన వలసిందిగా విజ్ఞప్తి.
ఇట్లు: మన ఊరి ఆరోగ్య వికాసం

WhatsApp Image 2019-07-14 at 7.34.00 AM

మన ఊరి వికాసం, 14 జులై 2019

“మీ సేవలు మాకు స్పూర్తిదాయకం”

గ్రామ ప్రజలకు ఉచిత సేవ చేయుచున్న డా.క్రిష్ణ మోహన్ గారు అనివార్య కారణాల వలన ఈ నెల వైద్య శిబిరంనకు హాజరు కాలేకపోవడం వలన, ఆరోగ్య వికాసం కార్యకర్తలు యధావిధిగా వైద్య శిబిరం నిర్వహించి ,గ్రామ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు. ఈ వైద్య శిబిరంనకు 45 మంది రోగులు హాజరు అయినారు .

ఆరోగ్య వికాసం కార్యకర్తలు నిస్వార్ధంతో గ్రామానికి మీరు అందింస్తున్న సేవలు మాకు ఎంతో స్ఫూర్తిదాయకం.
@మనఊరివికాసం

ఫొటోస్